అబుదాబి–ముంబై ఎయిర్ విస్తారా విమానంలో సిబ్బందిపై దాడి, అర్థనగ్న ప్రదర్శన
- January 31, 2023
అబుదాబి: విమానాల్లో ప్రయాణికుల దాడుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి వృద్ధ మహిళపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఎయిర్ విస్తారా ఫ్లైట్లో ఇటలీకి చెందిన 45ఏళ్ల మహిళ హల్చల్ చేసింది. సిబ్బందిపై దాడిచేయడంతో పాటు ఒంటిపై బట్టలు విప్పి అర్థనగ్నంగా కారిడార్లో నడిచింది. అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న విమానంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఆ మహిళను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎయిర్ విస్తారా మంగళవారం ధృవీకరించింది.
ఈ ఘటనపై ఎయిర్ విస్తారా ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 30న అబుదాబి నుంచి ముంబై వెళ్లే ఎయిర్ విస్తారా విమానం 30వ తేదీ తెల్లవారు జామున 2.03 గంటలకు అబుదాబీలో బయలు దేరింది. 2.30 గంటల సమయంలో ఎకానమీ క్లాస్లో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా లేచి బిజినెస్ క్లాస్ లో కూర్చుంది. క్యాబిన్లోని ఇద్దరు సభ్యులు వెళ్లి ఆ మహిళతో మాట్లాడారు. తిరిగి తమ సీటుకు తిరిగి వెళ్లాలని కోరారు. అయితే, ఇటలీకి చెందిన 45ఏళ్ల పావోలా పెరూసియో అనే మహిళ తిరిగి ఆమె సీటుకు వెళ్లకపోగా సిబ్బందిపై దుర్భాషలాడిందని, ఓ సిబ్బందిపై దాడిచేయడంతో పాటు మరో సిబ్బందిపై ఉమ్మి వేసిందని ఎయిర్ విస్తారా ఆ ప్రకటనలో తెలిపింది. కొద్దిసేపటికే మహిళ తన ఒంటిపై బట్టలు విప్పి విమానంలోనే అర్థనగ్న ప్రదర్శన చేసినట్లు ఎయిర్ విస్తారా తన ప్రకటనలో తెలిపింది.
సుదీర్ఘ గొడవ అనంతరం మహిళలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే మహిళను విస్తారా భద్రతా అధికారులకు అప్పగించారు. ఆ తరువాత విమాన సిబ్బంది ఫిర్యాదుతో సహార్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







