వెంకీ కూడా ప్యాన్ ఇండియాని టార్గెట్ చేశాడా.?
- February 20, 2023
విక్టరీ వెంకటేష్ ఆచి తూచి సినిమాలు చేస్తుంటాడు. కథ, పాత్ర నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఆలోచించడు. అలాగే రీసెంట్గా యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. ఇక, ఇప్పుడు సోలో హీరోగా ‘సైంధవ్’ అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ గ్లింప్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమాని వెంకీ సోలో మూవీగా అనుకుంటే, ఇదో మల్టీస్టారర్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ యాడ్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఇంపార్టెంట్ రోల్లో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. తాజాగా తమిళ హీరో ఆర్య కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తాజా సమాచారం.
సరికొత్త పాత్రలో ఆర్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. సౌత్లోని అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్లోనూ ‘సైంధవ్’ని రిలీజ్ చేయనున్నారు. అలా, ‘సైంధవ్’ తో విక్టరీ వెంకటేష్ కూడా ప్యాన్ ఇండియాని టచ్ చేయబోతున్నాడన్న మాట.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







