వెంకీ కూడా ప్యాన్ ఇండియాని టార్గెట్ చేశాడా.?
- February 20, 2023
విక్టరీ వెంకటేష్ ఆచి తూచి సినిమాలు చేస్తుంటాడు. కథ, పాత్ర నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఆలోచించడు. అలాగే రీసెంట్గా యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. ఇక, ఇప్పుడు సోలో హీరోగా ‘సైంధవ్’ అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ గ్లింప్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమాని వెంకీ సోలో మూవీగా అనుకుంటే, ఇదో మల్టీస్టారర్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ యాడ్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఇంపార్టెంట్ రోల్లో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. తాజాగా తమిళ హీరో ఆర్య కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తాజా సమాచారం.
సరికొత్త పాత్రలో ఆర్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. సౌత్లోని అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్లోనూ ‘సైంధవ్’ని రిలీజ్ చేయనున్నారు. అలా, ‘సైంధవ్’ తో విక్టరీ వెంకటేష్ కూడా ప్యాన్ ఇండియాని టచ్ చేయబోతున్నాడన్న మాట.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









