వెంకీ కూడా ప్యాన్ ఇండియాని టార్గెట్ చేశాడా.?
- February 20, 2023
విక్టరీ వెంకటేష్ ఆచి తూచి సినిమాలు చేస్తుంటాడు. కథ, పాత్ర నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఆలోచించడు. అలాగే రీసెంట్గా యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. ఇక, ఇప్పుడు సోలో హీరోగా ‘సైంధవ్’ అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ గ్లింప్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమాని వెంకీ సోలో మూవీగా అనుకుంటే, ఇదో మల్టీస్టారర్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ యాడ్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఇంపార్టెంట్ రోల్లో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. తాజాగా తమిళ హీరో ఆర్య కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తాజా సమాచారం.
సరికొత్త పాత్రలో ఆర్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. సౌత్లోని అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్లోనూ ‘సైంధవ్’ని రిలీజ్ చేయనున్నారు. అలా, ‘సైంధవ్’ తో విక్టరీ వెంకటేష్ కూడా ప్యాన్ ఇండియాని టచ్ చేయబోతున్నాడన్న మాట.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







