వెంకీ కూడా ప్యాన్ ఇండియాని టార్గెట్ చేశాడా.?
- February 20, 2023
విక్టరీ వెంకటేష్ ఆచి తూచి సినిమాలు చేస్తుంటాడు. కథ, పాత్ర నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఆలోచించడు. అలాగే రీసెంట్గా యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. ఇక, ఇప్పుడు సోలో హీరోగా ‘సైంధవ్’ అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ గ్లింప్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమాని వెంకీ సోలో మూవీగా అనుకుంటే, ఇదో మల్టీస్టారర్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ యాడ్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఇంపార్టెంట్ రోల్లో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. తాజాగా తమిళ హీరో ఆర్య కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తాజా సమాచారం.
సరికొత్త పాత్రలో ఆర్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. సౌత్లోని అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్లోనూ ‘సైంధవ్’ని రిలీజ్ చేయనున్నారు. అలా, ‘సైంధవ్’ తో విక్టరీ వెంకటేష్ కూడా ప్యాన్ ఇండియాని టచ్ చేయబోతున్నాడన్న మాట.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







