ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీయార్.!
- March 06, 2023గత కొన్ని రోజులుగా అమెరికాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా రామ్ చరణ్ అమెరికా వెళ్లాడు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ తెలుగు సినిమా గొప్పతనం గురించి చాటి చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12న జరగబోయే ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలోనూ చరణ్ పాల్గొనబోతున్నాడు.
ఇదే విషయమై ఎన్టీయార్, చరణ్ అభిమానుల మధ్య చిచ్చు చినుకులా మొదలై గాలి వానలా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక, ఈ గాలివానను చల్లార్చేందుకు ఎన్టీయార్ సంసిద్ధమయ్యాడు. ఆస్కార్ అవార్డుల్లో ఎన్టీయార్కీ ఓ అవార్డు వుందని సంబంధిత శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీయార్ అమెరికాకు బయలుదేరాడు. తారకరత్నకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసిన ఎన్టీయార్, అమెరికాకు ప్రయాణం కట్టాడు. సో.. ఇక్కడితోనైనా చరణ్, ఎన్టీయార్ మధ్య అభిమానుల పేరుతో బలవంతంగా పెట్టేసిన చిచ్చుకు చెక్ పడుతుందేమో చూడాలిక.
తాజా వార్తలు
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..