సౌదీ అరేబియాలో వారంలో 16,649 మంది అరెస్ట్
- March 26, 2023రియాద్ : రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 16,649 మందిని ఒక వారంలో రాజ్యంలో వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 16 నుండి 22 వరకు వారంలో రాజ్యమంతటా భద్రతా దళాల వివిధ విభాగాలు నిర్వహించిన ఉమ్మడి క్షేత్ర తనిఖీల సందర్భంగా ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టులలో 9,259 మంది నివాస వ్యవస్థను ఉల్లంఘించినవారు, 4,899 మంది సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినవారు, 2,491 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. మరో 1,132 మంది ప్రజలు రాజ్యంలోకి సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అరెస్టు అయ్యారు. అరెస్టయిన వారిలో 45% మంది యెమెన్లు, 52% ఇథియోపియన్లు, 3% ఇతర జాతీయులున్నారు. రెసిడెన్సీ, పని నిబంధనలను ఉల్లంఘించేవారిని రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం లాంటి కేసులో 18 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 15,782 మంది ఉల్లంఘించినవారు ప్రస్తుతం నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రక్రియలకు లోబడి ఉన్నారని, వీరిలో 13,415 మంది పురుషులు, 2,367 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. 7,722 మంది ఉల్లంఘించినవారు ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు, 1,933 మంది ఉల్లంఘించిన వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి రిఫరచేయగా.. 12,765 మంది ఉల్లంఘించిన వారిని బహిష్కరించినట్లు తెలిపారు. ఎవరైనా చొరబాటుదారుని రాజ్యంలోకి ప్రవేశించడాన్ని సులభతరం చేసిన లేదా అతనికి రవాణా లేదా ఆశ్రయం లేదా ఏదైనా సహాయం లేదా ఇతర సేవను అందించిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..