ఆ పత్రాలను ధ్వంసం చేస్తే.. Dh1 మిలియన్ జరిమానా, జైలు శిక్ష
- March 28, 2023యూఏఈ: పబ్లిక్, చారిత్రాత్మక, జాతీయ, ప్రైవేట్ పత్రాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన సందర్భాల్లో విధించే జరిమానా, జైలుశిక్ష గురించిన వివరాలను యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్ట్ పెట్టింది. నేషనల్ లైబ్రరీ, ఆర్కైవ్స్ సవరణలపై 2008 ఫెడరల్ లా నెం. (7)లోని ఆర్టికల్ నెం.25 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక పత్రాన్ని నాశనం చేస్తే.. వారికి నిర్బంధ శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఎనిమిది నెలల జరిమానాతోపాటు Dh40,000 - Dh100,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిని విధించే అవకాశం ఉందని వివరించింది. కీలక పత్రాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసినా, స్మగ్లింగ్ చేసినా, కాపీలు చేసినా లేదా బహిర్గతం చేసినా కనీసం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష లేదా Dh50,000 - Dh 1,000,000 వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు