ఆ పత్రాలను ధ్వంసం చేస్తే.. Dh1 మిలియన్ జరిమానా, జైలు శిక్ష
- March 28, 2023
యూఏఈ: పబ్లిక్, చారిత్రాత్మక, జాతీయ, ప్రైవేట్ పత్రాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన సందర్భాల్లో విధించే జరిమానా, జైలుశిక్ష గురించిన వివరాలను యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్ట్ పెట్టింది. నేషనల్ లైబ్రరీ, ఆర్కైవ్స్ సవరణలపై 2008 ఫెడరల్ లా నెం. (7)లోని ఆర్టికల్ నెం.25 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక పత్రాన్ని నాశనం చేస్తే.. వారికి నిర్బంధ శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఎనిమిది నెలల జరిమానాతోపాటు Dh40,000 - Dh100,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిని విధించే అవకాశం ఉందని వివరించింది. కీలక పత్రాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసినా, స్మగ్లింగ్ చేసినా, కాపీలు చేసినా లేదా బహిర్గతం చేసినా కనీసం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష లేదా Dh50,000 - Dh 1,000,000 వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







