యెమెన్ ఖైదీల మార్పిడిని స్వాగతించిన జీసీసీ చీఫ్
- April 15, 2023
రియాద్: యెమెన్ ప్రభుత్వం, హౌతీల మధ్య ఖైదీల మార్పిడి ప్రారంభాన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్-బుదైవి శుక్రవారం స్వాగతించారు. రమదాన్ పవిత్ర మాసంలో మానవతా చొరవలో భాగంగా ఖైదీల మార్పిడి ఒప్పందం కుదరడం, దీంతో వందలాది మంది ఖైదీలు స్వదేశానికి తిరిగి రావడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. యెమెన్ సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనడం, శాశ్వత సంధి ద్వారా యెమెన్ దాని ప్రజలకు శాంతిని తిరిగి తీసుకురావడం, గల్ఫ్ ఆధారంగా యెమెన్ ప్రాంతంలో స్థిరత్వాన్ని సాధించేందుకు రాజకీయ పరిష్కారం ద్వారా కొనసాగుతున్న ప్రయత్నాలకు ఇది మరింత ప్రోత్సాహం అందిస్తుందన్నారు. సనాలో పోరాడుతున్న పక్షాల మధ్య మధ్యవర్తిత్వం కోసం సౌదీ, ఒమానీ ప్రతినిధుల ప్రయత్నాలను GCC చీఫ్ ప్రశంసించారు. యెమెన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అన్ని GCC సభ్య దేశాల తిరుగులేని వైఖరిని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







