యెమెన్ ఖైదీల మార్పిడిని స్వాగతించిన జీసీసీ చీఫ్
- April 15, 2023
రియాద్: యెమెన్ ప్రభుత్వం, హౌతీల మధ్య ఖైదీల మార్పిడి ప్రారంభాన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్-బుదైవి శుక్రవారం స్వాగతించారు. రమదాన్ పవిత్ర మాసంలో మానవతా చొరవలో భాగంగా ఖైదీల మార్పిడి ఒప్పందం కుదరడం, దీంతో వందలాది మంది ఖైదీలు స్వదేశానికి తిరిగి రావడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. యెమెన్ సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనడం, శాశ్వత సంధి ద్వారా యెమెన్ దాని ప్రజలకు శాంతిని తిరిగి తీసుకురావడం, గల్ఫ్ ఆధారంగా యెమెన్ ప్రాంతంలో స్థిరత్వాన్ని సాధించేందుకు రాజకీయ పరిష్కారం ద్వారా కొనసాగుతున్న ప్రయత్నాలకు ఇది మరింత ప్రోత్సాహం అందిస్తుందన్నారు. సనాలో పోరాడుతున్న పక్షాల మధ్య మధ్యవర్తిత్వం కోసం సౌదీ, ఒమానీ ప్రతినిధుల ప్రయత్నాలను GCC చీఫ్ ప్రశంసించారు. యెమెన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అన్ని GCC సభ్య దేశాల తిరుగులేని వైఖరిని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







