యెమెన్ ఖైదీల మార్పిడిని స్వాగతించిన జీసీసీ చీఫ్
- April 15, 2023
రియాద్: యెమెన్ ప్రభుత్వం, హౌతీల మధ్య ఖైదీల మార్పిడి ప్రారంభాన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్-బుదైవి శుక్రవారం స్వాగతించారు. రమదాన్ పవిత్ర మాసంలో మానవతా చొరవలో భాగంగా ఖైదీల మార్పిడి ఒప్పందం కుదరడం, దీంతో వందలాది మంది ఖైదీలు స్వదేశానికి తిరిగి రావడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. యెమెన్ సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనడం, శాశ్వత సంధి ద్వారా యెమెన్ దాని ప్రజలకు శాంతిని తిరిగి తీసుకురావడం, గల్ఫ్ ఆధారంగా యెమెన్ ప్రాంతంలో స్థిరత్వాన్ని సాధించేందుకు రాజకీయ పరిష్కారం ద్వారా కొనసాగుతున్న ప్రయత్నాలకు ఇది మరింత ప్రోత్సాహం అందిస్తుందన్నారు. సనాలో పోరాడుతున్న పక్షాల మధ్య మధ్యవర్తిత్వం కోసం సౌదీ, ఒమానీ ప్రతినిధుల ప్రయత్నాలను GCC చీఫ్ ప్రశంసించారు. యెమెన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అన్ని GCC సభ్య దేశాల తిరుగులేని వైఖరిని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







