సముద్రంలో నిలిచిన బోట్.. నలుగురుని రక్షించిన నేవీ

- April 15, 2023 , by Maagulf
సముద్రంలో నిలిచిన బోట్.. నలుగురుని రక్షించిన నేవీ

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిన పడవ నుంచి నలుగురు ఒమన్ పౌరులను ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. నలుగురు పౌరులతో కూడిన ఒమానీ ఫిషింగ్ బోట్.. మస్కట్ సముద్ర ప్రాంతానికి ఈశాన్యంగా సముద్రంలో సాంకేతిక లోపంతో  నిలిచిపోయినట్లు సమాచారం అందిందని, రాయల్ ఒమన్ పోలీసు కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో పరిస్థితిని పరిష్కరించి, దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ బార్కాలోని ఫిషింగ్ పోర్ట్‌కు పడవను తీసుకొచ్చినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com