ఈద్ అల్-ఫితర్ సెలవులు: 900 విమానాలలో 110,000 సీట్లు బుక్
- April 19, 2023
కువైట్: ఈద్ అల్-ఫితర్ సెలవులను పురస్కరించుకొని ఏప్రిల్ 20 - 25 మధ్య సుమారు 110,000 మంది పౌరులు , నివాసితులు 900 విమానాలలో ప్రయాణించడానికి టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఈద్ సెలవుల్లో దుబాయ్, ఇస్తాంబుల్, సబీహా, జెద్దా, దోహాలకు ఎక్కువగా ప్రయాణించేందుకు టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లు ట్రావెల్ సంబంధిత నివేదికలు తెలిపాయి. ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న ఏజెన్సీలు హాలిడే సీజన్ను ఎదుర్కోవడానికి ఫీల్డ్ ప్లాన్లను సమీక్షించడానికి గత రోజులలో గ్రౌండ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనేక సమావేశాలు నిర్వహించాయి. పెద్ద సంఖ్యలో చేరుకునే ప్రయాణికుల సంఖ్యను ఎదుర్కోవడానికి విమానాశ్రయం సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల నుండి ఎయిర్క్రాఫ్ట్ గేట్ల వరకు ప్రయాణీకుల రాకపోకలు సజావుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









