ఈద్ అల్-ఫితర్ సెలవులు: 900 విమానాలలో 110,000 సీట్లు బుక్
- April 19, 2023
కువైట్: ఈద్ అల్-ఫితర్ సెలవులను పురస్కరించుకొని ఏప్రిల్ 20 - 25 మధ్య సుమారు 110,000 మంది పౌరులు , నివాసితులు 900 విమానాలలో ప్రయాణించడానికి టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఈద్ సెలవుల్లో దుబాయ్, ఇస్తాంబుల్, సబీహా, జెద్దా, దోహాలకు ఎక్కువగా ప్రయాణించేందుకు టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లు ట్రావెల్ సంబంధిత నివేదికలు తెలిపాయి. ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న ఏజెన్సీలు హాలిడే సీజన్ను ఎదుర్కోవడానికి ఫీల్డ్ ప్లాన్లను సమీక్షించడానికి గత రోజులలో గ్రౌండ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనేక సమావేశాలు నిర్వహించాయి. పెద్ద సంఖ్యలో చేరుకునే ప్రయాణికుల సంఖ్యను ఎదుర్కోవడానికి విమానాశ్రయం సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల నుండి ఎయిర్క్రాఫ్ట్ గేట్ల వరకు ప్రయాణీకుల రాకపోకలు సజావుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!







