సౌదీ అరేబియాలో మెట్ పల్లి పట్టణ వాసి మృతి
- May 16, 2023
సౌదీ అరేబియా: తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మెట్పల్లి పట్టణానికి చెందిన మార్గం విజయ్,(36) సౌదీ అరేబియా అలహాస ప్రాంతంలో మరణించాడు.చిన్న వయసులో తండ్రిని కోల్పోయి అనాధగా మారిన దీక్షిత,అక్షిత. ఉన్న అప్పులు కట్టుకోవడానికి జీవితం సరిపోయింది, ఇంకా 10 లక్షలు అప్పు ఉంది. కుటుంబ పోషణ కోసం, బిడ్డలను గొప్పగా చదివించాలని, ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లడం జరిగింది. తాను పనిచేస్తున్న కంపెనీ లోనే తిరుపతి రాచకొండ, వైజాగ్ రాజు, మరియు ఫరూక్ మరియు అబ్దుల్ రఫీక్, చిన్న అంజయ్య, మారుతి మార్గం, పెరిక రాజేందర్, లక్ష్మీనారాయణ గౌడ్, మరియు ఇండియన్ ఎంబసీ కు చెందిన ముయోద్దీన్ రెహమతుల్లా సహకారంతో మృతదేహాన్ని ఇంటికి చేర్చడం జరిగింది. విమానాశ్రయం నుంచి మృతదేహాన్ని ఇంటికి చేర్చడానికి బడుగు లక్ష్మణ్ ఎన్నారై చిన్నారి డిపార్ట్మెంట్ చిట్టిబాబు సహకారంతో ఉచిత అంబులెన్స్ సమకూర్చడం జరిగింది. గల్ఫ్ లో చనిపోయిన నిరుపేద గల్ఫ్ కార్మికుడు మృతదేహాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తక్షణ సహాయం కింద ఐదు లక్షల రూపాయలు తక్షణ సహాయం అందించాలని,గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్ల నిధులతో ఎన్నారై పాలసీ అమలు చేసే విధంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కృషి చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యులు విన్నపం తెలియజేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







