యూఏఈ లో 50°C దాటిన ఉష్ణోగ్రత: కారులోని గ్యాస్ ట్యాంక్ పేలిపోతుందా?
- July 19, 2023
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు ఇటీవల 50°C-మార్క్ను దాటిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వేసవి వేడి నుండి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు నివాసితులకు సలహా ఇస్తున్నారు. అదే సమయంలో కొన్ని నివారణ చర్యలకు సంబంధించిన పుకార్లు సైతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో వేసవిలో గ్యాస్ ట్యాంక్ పేలుడు సంభవిస్తుందని, కారు ఇంధన ట్యాంక్ను పూర్తిగా నింపవద్దని వాహనదారుల హెచ్చరించారు. గాలి ఆవిరైపోవడానికి డ్రైవర్లు కనీసం రోజుకు ఒకసారి ట్యాంక్ మూత తెరవాలని మరొకరు సూచిస్తున్నారు.
అయితే, "ఈ హెచ్చరికల వెనుక ఎటువంటి నిజం లేదు," అని ఒక రహదారి భద్రతా నిపుణుడు చెప్పారు. ఇలాంటివి తరచుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వేసవిలో వైరల్ అయ్యే పాత కథలేనని కొట్టిపారేశారు యూఏఈలో రోడ్ సేఫ్టీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్. వాహన తయారీదారులు మరియు నిపుణులు ఆటోమొబైల్స్ రూపకల్పన చేసేటప్పుడు పరిసర ఉష్ణోగ్రత పరిస్థితులు, పనితీరు అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బయటి ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ట్యాంక్లో పగుళ్లు రాకుండా ఉండటానికి డ్రైవర్లు ట్యాంక్లో తగినంత ఇంధనం ఉండేలా చూసుకోవాలని ఎడెల్మాన్ సూచించారు.
పెట్రోల్ బంకుల్లో వాహనదారులు తప్పనిసరిగా అనుసరించాల్సిన భద్రతా చిట్కాలు:
-ఇంధనం నింపేటప్పుడు మీ వాహనం ఇంజిన్ను ఆఫ్ చేయండి. మీ వాహనాన్ని పార్క్ (ఆటోమేటిక్) లేదా మొదటి గేర్ (మాన్యువల్)లో ఉంచండి. హ్యాండ్ బ్రేక్ని ఉపయోగించండి.
-ఇంధనం నింపుకునేటప్పుడు పొగ, లైట్ మ్యాచ్లు లేదా లైటర్లను ఉపయోగించవద్దు.(కారు లోపల కూడా)
-మొబైల్ ఫోన్లను ఉపయోగించవద్దు.
-పెట్రోల్ వాసనలు చాలా విషపూరితమైనవి. మీరు కారులో ఉండి.. కిటికీలు మూసి ఉంచండి. పిల్లలను కారు లోపలే ఉండేలా చూడండి.
-ఇంధనం నింపిన తర్వాత మాత్రమే కారును ముందుకుపోనియ్యాలి.
- గ్యాస్ స్టేషన్లోని భూగర్భ ట్యాంకులను ట్యాంకర్లు నింపే సమయంలో సురక్షితమైన దూరంలో ఉండండి.
-గ్యాసోలిన్ను రవాణా చేయడానికి లేదా నిల్వ చేయడానికి ఆమోదించబడిన పోర్టబుల్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించండి.
-మీరు ఫిల్లింగ్ స్టేషన్లోని కన్వీనియన్స్ స్టోర్, కార్ వాష్, గ్యారేజీ లేదా ఇతర దుకాణాలకు వెళితే, వాహనాలు కదులకుండా జాగ్రత్తలు తీసుకోండి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







