తిరుమల నడకదారిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం: టీటీడీ ఈవో
- August 12, 2023
తిరుమల: టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరమని అన్నారు. నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఘటనపై సిసిఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకాన్స్ట్రక్షన్ చేయించామని.. చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించామన్నారు. నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
ఘాట్ రోడ్డులో సాయంత్రం 6:00 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేస్తామన్నారు. నడకదారులలో రెండు గంటల వరకే భక్తులను అనుమతించే అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నడక మార్గంలో ప్రతి 45 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు చేపడతామన్నారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









