జెబెల్ అలీ గురుద్వారాలో పవిత్ర ఖురాన్ పఠనం!
- June 24, 2015
"దయచేసి రమదాన్ దినాలలో లoగరు (ప్రసాదం) పార్సిల్ ను అడగవద్దు" - అని సూచించే ఇంగ్లీషు మరియు గురుముఖి(పంజాబీ) భాషలలో ఉన్న విజ్ఞాపన, మసీదు ముందు కాక గురుద్వారా ముందు చూసి ఇకపై ఆశ్చర్యపోవద్దు! దుబాయి, జెబెల్ అలీ లోనున్న గురుద్వారాలో వరుసగా రెండవ సంవత్సరం కూడా రమదాన్ పాటింపబడుతున్న సత్సాంప్రదాయంలో, ఈ సంవత్సరం జులై 22 ఇఫ్తార్ నాటి ప్రత్యేక సందర్భానికి గౌరవ అతిధులుగా, ప్రముఖ ఇస్లాం వక్త - అహ్మద్ హమిద్, అల్ మానార్ సెంటర్ ప్రతినిధి అబ్దుల్ హాదీ రానున్నారు.
ఈ విషయమై హమిద్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దైవoపై నమ్మకాన్ని పంచి ఇవ్వడానికి ఇదే ఉత్తమ సమయమని బోధించారు. ఈ కార్యక్రమానికి 20 మంది ఇతర ముస్లిం మిత్రులను, మూడు చర్చిల సభ్యులను, క్రిస్టియన్లను కూడా ఆహ్వానించిన గురునానక్ దర్బార్ యొక్క ఛైర్మన్ శ్రీ సురిందర్ సింగ్ కాంధారీ, దేవునికి తమనుతాము అర్పించుకోవడం గురించిన హమీద్ గారి ప్రసంగాన్ని ప్రశంసించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







