2వ సౌదీ వరల్డ్ డిఫెన్స్ షో. స్టాల్స్ కోసం తీవ్రమైన పోటీ
- September 01, 2023
రియాద్: సౌదీ రాజధాని రియాద్లో ఫిబ్రవరి 2024లో జరగనున్న వరల్డ్ డిఫెన్స్ షో (డబ్ల్యుడిఎస్) రెండవ ఎడిషన్లో పాల్గొనడం ద్వారా అనేక ప్రముఖ సౌదీ, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులను విస్తరించేందుకు భారీ ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఎగ్జిబిటర్లు దాదాపు 47,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 93 శాతం ఎగ్జిబిషన్ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నారు. జనరల్ అథారిటీ ఫర్ మిలిటరీ ఇండస్ట్రీస్ (GAMI) ఫిబ్రవరి 4-8 తేదీలలో రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం దేశంలో అత్యుత్తమ రక్షణ మరియు భద్రతా ప్రదర్శనలలో ఒకటిగా నిర్వహించాలనే ప్రభుత్వ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. రెండవ ఎడిషన్ లో 45 దేశాల నుండి 750 మంది ప్రదర్శనకారులు, 115 అధికారిక ప్రతినిధులు, దేశ విదేశాల నుండి 100,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియా, రష్యా, క్రొయేషియా, ఆస్ట్రియా, పోలాండ్, ఎస్టోనియా, గ్రీస్, ఉక్రెయిన్, ఇతర దేశాల పెవిలియన్లతో పాటు చైనీస్, టర్కిష్, అమెరికన్, యూఏఈ పెవిలియన్లు WDSలో అతిపెద్ద పెవిలియన్లలో ఒకటిగా ఉండనున్నాయి.
క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మొదటి ఎడిషన్ను ప్రారంభించారు. అందులో దాదాపు 590 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొన్నాయి. 600 మంది ఎగ్జిబిటర్లు మరియు 45 దేశాల నుండి 65,000 వాణిజ్య సందర్శనలు, అలాగే 100 అధికారిక ప్రతినిధులు, 16,000 రిజిస్టర్డ్ ఎగ్జిబిటర్లు.. టాప్ 40 గ్లోబల్ డిఫెన్స్ కంపెనీలలో 26 పాల్గొన్నాయి. SR29.7 బిలియన్ల($7.7 బిలియన్లు) విలువైన కొనుగోలు ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









