మస్కట్-చెన్నై విమానంలో భారీ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!
- September 18, 2023
మస్కట్: ఒమన్ నుండి దక్షిణ భారత నగరమైన చెన్నైకి బయలుదేరిన విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు భారీ మొత్తంలో బంగారం, ఐఫోన్లు, ల్యాప్టాప్లను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై చెన్నై కస్టమ్స్ శుక్రవారం ప్రత్యేక పద్ధతిలో అదుపులోకి తీసుకున్నారు. వివిధ భారతీయ వార్తా ఆన్లైన్ నివేదికల ప్రకారం.. మస్కట్ నుండి చెన్నైకి విమానంలో 113 మంది ప్రయాణికులు భారీ స్మగ్లింగ్ ప్లాన్లో పాల్గొన్నారు. పక్కా సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు వారి యత్నాలను అడ్డుకున్నారు. కస్టమ్స్ అధికారులు విచారించగా ప్రయాణికుల్లో ఒకరు నానాయాగీ వేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒక నివేదిక ప్రకారం.. గురువారం ఉదయం విమానం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ వస్తువులను తీసుకువెళుతున్నారనే అనుమానంతో దాదాపు 130 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం వచ్చిన 186 మంది ప్రయాణికుల్లో 113 మంది ప్రయాణికుల వద్ద కొత్త ఐఫోన్లు, గూగుల్ ఫోన్లు వంటి ఖరీదైన గాడ్జెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికులను క్యారియర్లుగా చేసుకుని ఖరీదైన వస్తువులను స్మగ్లింగ్ చేస్తున్నట్టు విచారణలో తేలింది. ప్రయాణీకులందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, చెన్నై విమానాశ్రయంలో ఫోన్ తిరిగి వచ్చిన తర్వాత కమీషన్, చాక్లెట్లు మరియు గూడీస్ ఇస్తానని వాగ్దానం చేస్తూ విమానంలోని సహ-ప్రయాణికుడు ఫోన్ను తమకు అందజేసినట్లు ప్రయాణీకులలో ఒకరు అంగీకరించారు.
మస్కట్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన విమానంలో వందమందికి పైగా ప్రయాణికులు పెద్ద మొత్తంలో బంగారం, ఐఫోన్లు, ల్యాప్టాప్లు, కుంకుమపువ్వు స్మగ్లింగ్ చేస్తున్నట్లు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. వీరిలో ఎవరెవరు స్మగ్లింగ్ రాకెట్లో పాల్గొన్నారనేది స్పష్టంగా తెలియకపోవడంతో ప్రయాణికులందరినీ ఆపి గంటల తరబడి విచారించినట్లు నివేదిక పేర్కొంది. చివరకు ఇందులో 73 మందికి స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధం లేదని నిర్ధారించారు. దీంతో మిగిలిన 113 మంది ప్రయాణికులను పోలీసులు సోదాలు చేశారు. లోదుస్తుల లోపల బంగారు నగలు, బంగారు కంకణాలు దాచుకున్నట్లు తేలింది. వారి సూట్కేస్లు, బ్యాగులను తనిఖీ చేయగా అందులో 13 కిలోల బంగారం, 120 ఐఫోన్లు, 84 ఆండ్రాయిడ్ ఫోన్లు, విదేశీ సిగరెట్లు, ల్యాప్టాప్లు దాచి ఉంచారు. జప్తు చేయబడిన వస్తువుల మొత్తం విలువ INR14 కోట్లకు పైగా ఉంటుందని (OMR 647,697) అధికారులు తెలిపారు. అనంతరం కస్టమ్స్ అధికారులు 113 మందిపై కస్టమ్స్ చట్టం కింద కేసులు నమోదు చేసి బెయిల్పై విడుదల చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!