మతిమరుపుకు మందేయండిలా.!
- September 19, 2023
వయసుతో పాటూ కాస్త చాదస్తం కూడా పెరుగుతుంటుంది. అలాగే పెరుగుతున్న వయసులో భాగంగా ఎక్కువగా ఎదుర్కొనే సమస్య.. మతిమరుఫు సమస్య. ఈ సమస్యకు మందుందా.? లేదా.? అనే సంగతి అటుంచితే.! పాలకూరను ఎక్కువగా తినే వారిలో మతి మరుపు సమస్య చాలా అరుదుగా వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
పాలకూర లేదా స్పినాచ్ అధికంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా వుంటుంది. ఈ ఆకుకూరలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటూ పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్.
అవి శరీరానికి అత్యంత విలువైన శక్తినివ్వడమే కాకుండా, బ్రెయిన్ షార్ప్గా పని చేసేలా చేస్తాయట. అలాగే, బ్రెయిన్ క్యాన్సర్ తదితర సమస్యలు భవిష్యత్తులో దరి చేరనీయకుండా చేస్తాయట. మెదడు సక్రమంగా పని చేస్తే మతి మరుపు సమస్య వచ్చే అవకాశమే లేదుగా.!
అలా మెదడు ఆరోగ్యంలో అత్యంత కీలకంగా పని చేస్తుంది పాలకూర. అందుకే ఈ ఆకుకూరని తప్పకుండా మెనూలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వారంలో కనీసం మూడు, నాలుగు సార్లు పాలకూరను వివిధ రకాలుగా తీసుకోవడం వుత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









