మతిమరుపుకు మందేయండిలా.!
- September 19, 2023వయసుతో పాటూ కాస్త చాదస్తం కూడా పెరుగుతుంటుంది. అలాగే పెరుగుతున్న వయసులో భాగంగా ఎక్కువగా ఎదుర్కొనే సమస్య.. మతిమరుఫు సమస్య. ఈ సమస్యకు మందుందా.? లేదా.? అనే సంగతి అటుంచితే.! పాలకూరను ఎక్కువగా తినే వారిలో మతి మరుపు సమస్య చాలా అరుదుగా వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
పాలకూర లేదా స్పినాచ్ అధికంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా వుంటుంది. ఈ ఆకుకూరలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటూ పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్.
అవి శరీరానికి అత్యంత విలువైన శక్తినివ్వడమే కాకుండా, బ్రెయిన్ షార్ప్గా పని చేసేలా చేస్తాయట. అలాగే, బ్రెయిన్ క్యాన్సర్ తదితర సమస్యలు భవిష్యత్తులో దరి చేరనీయకుండా చేస్తాయట. మెదడు సక్రమంగా పని చేస్తే మతి మరుపు సమస్య వచ్చే అవకాశమే లేదుగా.!
అలా మెదడు ఆరోగ్యంలో అత్యంత కీలకంగా పని చేస్తుంది పాలకూర. అందుకే ఈ ఆకుకూరని తప్పకుండా మెనూలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వారంలో కనీసం మూడు, నాలుగు సార్లు పాలకూరను వివిధ రకాలుగా తీసుకోవడం వుత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ