మతిమరుపుకు మందేయండిలా.!
- September 19, 2023
వయసుతో పాటూ కాస్త చాదస్తం కూడా పెరుగుతుంటుంది. అలాగే పెరుగుతున్న వయసులో భాగంగా ఎక్కువగా ఎదుర్కొనే సమస్య.. మతిమరుఫు సమస్య. ఈ సమస్యకు మందుందా.? లేదా.? అనే సంగతి అటుంచితే.! పాలకూరను ఎక్కువగా తినే వారిలో మతి మరుపు సమస్య చాలా అరుదుగా వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
పాలకూర లేదా స్పినాచ్ అధికంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా వుంటుంది. ఈ ఆకుకూరలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటూ పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్.
అవి శరీరానికి అత్యంత విలువైన శక్తినివ్వడమే కాకుండా, బ్రెయిన్ షార్ప్గా పని చేసేలా చేస్తాయట. అలాగే, బ్రెయిన్ క్యాన్సర్ తదితర సమస్యలు భవిష్యత్తులో దరి చేరనీయకుండా చేస్తాయట. మెదడు సక్రమంగా పని చేస్తే మతి మరుపు సమస్య వచ్చే అవకాశమే లేదుగా.!
అలా మెదడు ఆరోగ్యంలో అత్యంత కీలకంగా పని చేస్తుంది పాలకూర. అందుకే ఈ ఆకుకూరని తప్పకుండా మెనూలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వారంలో కనీసం మూడు, నాలుగు సార్లు పాలకూరను వివిధ రకాలుగా తీసుకోవడం వుత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







