ద్వంద్వ పౌరసత్వ హక్కులపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- October 10, 2023
న్యూఢిల్లీ: రాజ్యాంగ పండితుడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పబ్లిక్ లా చైర్ తరుణబ్ ఖైతాన్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన భారత సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. మరొక పౌరసత్వాన్ని పొందడం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడాన్ని పిటిషన్ లో ఆయన సవాలు చేశారు. అలాంటి నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన పిటిషన్లో ప్రొఫెసర్ ఖైతాన్ ప్రత్యేకంగా పౌరసత్వ చట్టం సెక్షన్ 9(1), సెక్షన్ 4(1), సెక్షన్ 4(1A)కి రెండవ నిబంధన, 1955లోని సెక్షన్లను సవాలు చేశారు. "పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, భారత రాజ్యాంగ ధర్మాల విలువలకు విరుద్ధమని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. పౌరసత్వం దానంతట అదిగా కోల్పోవడం అనేది భారతదేశాన్ని అత్యంత నిర్బంధిత దేశాలలో వర్గీకరిస్తుంది. ’’ అని సెంచరీస్ మాగ్జిమ్ ఇంటర్నేషనల్ ఇండియా ఆఫీసులో సీనియర్ భాగస్వామి డాక్టర్ సైఫ్ మహమూద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిసి సేన్ న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







