ద్వంద్వ పౌరసత్వ హక్కులపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- October 10, 2023
న్యూఢిల్లీ: రాజ్యాంగ పండితుడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పబ్లిక్ లా చైర్ తరుణబ్ ఖైతాన్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన భారత సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. మరొక పౌరసత్వాన్ని పొందడం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడాన్ని పిటిషన్ లో ఆయన సవాలు చేశారు. అలాంటి నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన పిటిషన్లో ప్రొఫెసర్ ఖైతాన్ ప్రత్యేకంగా పౌరసత్వ చట్టం సెక్షన్ 9(1), సెక్షన్ 4(1), సెక్షన్ 4(1A)కి రెండవ నిబంధన, 1955లోని సెక్షన్లను సవాలు చేశారు. "పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, భారత రాజ్యాంగ ధర్మాల విలువలకు విరుద్ధమని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. పౌరసత్వం దానంతట అదిగా కోల్పోవడం అనేది భారతదేశాన్ని అత్యంత నిర్బంధిత దేశాలలో వర్గీకరిస్తుంది. ’’ అని సెంచరీస్ మాగ్జిమ్ ఇంటర్నేషనల్ ఇండియా ఆఫీసులో సీనియర్ భాగస్వామి డాక్టర్ సైఫ్ మహమూద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిసి సేన్ న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









