ద్వంద్వ పౌరసత్వ హక్కులపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- October 10, 2023
న్యూఢిల్లీ: రాజ్యాంగ పండితుడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పబ్లిక్ లా చైర్ తరుణబ్ ఖైతాన్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన భారత సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. మరొక పౌరసత్వాన్ని పొందడం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడాన్ని పిటిషన్ లో ఆయన సవాలు చేశారు. అలాంటి నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన పిటిషన్లో ప్రొఫెసర్ ఖైతాన్ ప్రత్యేకంగా పౌరసత్వ చట్టం సెక్షన్ 9(1), సెక్షన్ 4(1), సెక్షన్ 4(1A)కి రెండవ నిబంధన, 1955లోని సెక్షన్లను సవాలు చేశారు. "పౌరసత్వాన్ని ఆటోమెటిక్ గా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, భారత రాజ్యాంగ ధర్మాల విలువలకు విరుద్ధమని, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. పౌరసత్వం దానంతట అదిగా కోల్పోవడం అనేది భారతదేశాన్ని అత్యంత నిర్బంధిత దేశాలలో వర్గీకరిస్తుంది. ’’ అని సెంచరీస్ మాగ్జిమ్ ఇంటర్నేషనల్ ఇండియా ఆఫీసులో సీనియర్ భాగస్వామి డాక్టర్ సైఫ్ మహమూద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిసి సేన్ న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







