పూదోట నీలిమ ఎవరెస్టు శిఖరంపై పాదం మోపారు
- May 24, 2016
హైదరాబాద్ ఎట్టకేలకు పూదోట నీలిమ తన పతం నెగ్గించుకున్నారు. తన చిరకాల వాంఛ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరంపై పాదం మోపారు. విజయవంతంగా.. ఎవరెస్టు అధిరోహణం పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ లోని మెహదీపట్నం వాసి పూదోట నీలిమ ఎవరెస్టు శిఖరం పై మువ్వన్నెల పతాకను ఎగుర వేశారు. మగళవారం ఉదయం ఎవరెస్టు పై నీలిమ కాలుమోపినట్లు ఆమెకుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తుకపాలెం గ్రామానికి చెందిన నీలిమ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఆమె తండ్రి శౌరయ్య జర్నలిస్టు. బీటెక్ పూర్తి చేసిన నీలిమ బెంగళూరు లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే మక్కువ ఉన్న నీలిమ గత ఏడాది ఏప్రిల్ లో తొలిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లారు.అప్పట్లో నేపాల్ లో సంభవించిన పెను భూకంపం కారణంగా.. తన ప్రయత్నం విఫలమైంది.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బేస్ క్యాంప్ నుంచే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అయితే ఈ సారి విజయ వంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు నీలిమ కుటుంబ సభులు తెలిపారు.నీలిమ సాహసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎవరెస్టును అధిరోహించిన తొలి నవ్యాంధ్ర మహిళగా ఆమె అందరికీ గర్వకారణమని కొనియాడారు. నీలిమ చిరకాల కోరిక తీరడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నీలిమ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









