యూఏఈలో CBSE ప్రాంతీయ కార్యాలయం.. స్వాగతించిన విద్యావేత్తలు

- November 06, 2023 , by Maagulf
యూఏఈలో CBSE ప్రాంతీయ కార్యాలయం.. స్వాగతించిన విద్యావేత్తలు

యూఏఈ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రాంతీయ కార్యాలయాన్ని యూఏఈలో ఏర్పాటు చేయాలనే ఇండియా నిర్ణయించడంపై యూఏఈలోని సిబిఎస్‌ఇ పాఠశాల టీచర్లు సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయం విద్యార్థులు, ఉపాధ్యాయులకు సత్వర పరిష్కారాలను అందిస్తుందన్నారు. దుబాయ్‌లోని సిబిఎస్‌ఇ కార్యాలయాన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మూడు రోజుల యూఏఈ పర్యటన సందర్భంగా ప్రకటించారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన సమావేశంలో యూఏఈలోని సిబిఎస్‌ఇ పాఠశాలల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు.  సిబిఎస్‌ఇ ప్రణాళికాబద్ధమైన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం భారతీయ మిషన్లతో కలిసి పనిచేస్తుందని ప్రధాన్ పేర్కొన్నారు. యూఏఈలోని సాధారణ విద్యా పాఠశాలల్లో భారతీయ సంతతికి చెందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 271,109గా ఉంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 248,  ప్రైవేట్ పాఠశాలల్లో 270,861 మంది చదువుతున్నారు. విద్యార్థులు భారతదేశం వెలుపల బోర్డు మరియు పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com