గాజా పై అణుబాంబు వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ మంత్రిపై చర్యలు
- November 06, 2023
యూఏఈ: గాజాపై అణుబాంబు వేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ సమావేశాల నుండి సస్పెండ్ చేసినట్లు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్ దాడులపై తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని నెట్నాయహు పాలక కూటమిలోని అల్ట్రానేషనలిస్ట్ రాజకీయ నాయకుడు హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు ఇజ్రాయెల్ కోల్ బరామా అన్నారు. ఈ క్రమంలో అందరినీ ఒకేసారి చంపడానికి గాజా స్ట్రిప్పై అణు బాంబు వేయాలని భావిస్తున్నారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇజ్రాయెల్ మంత్రి అణుబాంబు వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందించంది. ఇజ్రాయెల్-హమస్ దాడుల్లో ఇప్పటివరకు 1,400 మంది ఇజ్రాయెల్ పౌరులు, 9,488 మంది పాలస్తీయన్లు చనిపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!