రవితేజను పక్కన పెట్టేసిన డైరెక్టర్.?
- December 09, 2023
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్కి సెపరేట్ క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ ట్రాక్ రికార్డు వుంది.
గోపీచంద్ మలినేనిని డైరెక్టర్గా ఇండస్ర్టీకి పరిచయం చేసిన ఘనత మాస్ రాజా రవితేజది. ఆ తర్వాత వరుసగా ఈ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలూ సూపర్ హిట్స్ అయ్యాయ్.
లేటెస్ట్గా రవితేజ సెకండ్ ఇన్నింగ్స్లో ‘క్రాక్’ హిట్ కొట్టింది కూడా ఇదే కాంబో. ఇంత మంచి ట్రాక్ రికార్డున్న ఈ కాంబినేషన్లో ఓ కొత్త సినిమాని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందించాల్సి వుంది. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనీ తెలుస్తోంది.
ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాదు కానీ, ఇదే కాన్సెప్ట్ని హీరోని మార్చేసి, గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారనీ మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజమెంత.?
గోపీచంద్ మలినేని, రవితేజ మధ్య మంచి స్నేహ సంబంధం వుంది. ఒకసారి ఒక హీరోతో కమిట్ అయిన ప్రాజెక్ట్.. అదీ రవితేజ వంటి స్టార్ హీరో ప్రాజెక్ట్ని మరో హీరోతో తెరకెక్కించడమేంటీ.? ఇప్పుడిదే ఇండస్ర్టీలో హాట్ టాపిక్. చూడాలి మరి, జస్ట్ ఇది గాసిప్ మాత్రమేనా.? లేదంటే, నిజమేనా.?
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







