గర్భిణీ స్త్రీల డైట్లో ఖచ్చితంగా వుండాల్సిందేంటంటే.!
- January 22, 2024పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే.. అందుకు తగ్గట్లుగా గర్భిణి స్త్రీలు పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. వైద్యులు సూచించే మందులతో పాటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, తల్లితో పాటూ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా బావుంటుంది.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో జింక్ శాతం సరిపడా స్థాయిలో వుండాలి. కణ విభజన, ప్రొటీన్ సంశ్లేషణ సహా పిండం పెరుగుదలలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది.
అందుకే గర్భిణీలు రోజుకు కనీసం 12mg మోతాదులో జింక్ కంటెంట్ తమ ఆహారంలో వుండేలా చూసుకోవాలి. మరి, జింక్ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేంటీ.? ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూరలో ఫైబర్, ప్రోటీన్స్తో పాటూ, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, జింక్ కూడా పుష్కలంగా వుంటుంది. అలాగే, బాదం పప్పులోనూ జింక్ లభిస్తుంది. నానబెట్టిన బాదం పప్పులు గర్భిణీ స్ర్తీలు చిరు తిండిలో భాగంగా చేసుకుంటే మంచిది.
నువ్వుల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దాంతో పాటూ జింక్ కూడా తగిన మోతాదులో వుంటుంది. ప్రతీరోజూ గర్భిణులు బెల్లం కలిపిన నువ్వుల లడ్డును తింటే చాలా మంచిది. దీనితో పాటూ, పల్లీలు కూడా గర్భిణీ స్ర్తీలకు చాలా చాలా మంచి ఆహారం.
వాస్తవంగా చెప్పాలంటే.. శరీరంలోని ఎంజైమ్స్ అన్నీ సక్రమంగా పని చేయాలంటే జింక్ అవసరం తప్పనిసరి. సో, జింక్ లభించే ఆహార పదార్ధాలను అందరూ తప్పకుండా తమ డైట్లో చేర్చుకోవాల్సిందే.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన