పరగడుపున బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?
- February 05, 2024
బొప్పాయిలోని ఆరోగ్య గుణాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లరక్త కణాలను పెంచడం, ఆరోగ్యంగా వుంచడంలో బొప్పాయి చాలా తోడ్పడుతుంది.
అయితే, బొప్పాయి పండును ఎప్పుడు తిన్నా ఆరోగ్యానికి మంచిదే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తింటే ఇంకా మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పరగడుపున బొప్పాయి పండు తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయిలోని ఎంజైమ్స్ ఆరోగ్యానికి అత్యంత మేలు చేయడమే కాకుండా.. ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినడం వల్ల.. చెడు కొలెస్ట్రాల్ దరి చేరకుండా వుంటుంది.
అంతేకాదు, కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. దాంతో, ఊబకాయం వున్న వారు పరగడుపున బొప్పాయి పండు తింటే బరువు తగ్గే అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
అంతేకాదు, జీర్ణ క్రియలో ఎటువంటి సమస్యలున్నా.. పరగడుపున బొప్పాయి పండు తినడం వల్ల క్యూర్ అయిపోతాయట. రోగ నిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణ క్రియ సక్రమంగా వుండడం వల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది. ఈ సమస్య వున్నవారు ఖచ్చితంగా బొప్పాయి పండు తింటే ఫలితం వుంటుందని నిపుణులు నిక్కర్చిగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







