పరగడుపున బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?
- February 05, 2024బొప్పాయిలోని ఆరోగ్య గుణాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లరక్త కణాలను పెంచడం, ఆరోగ్యంగా వుంచడంలో బొప్పాయి చాలా తోడ్పడుతుంది.
అయితే, బొప్పాయి పండును ఎప్పుడు తిన్నా ఆరోగ్యానికి మంచిదే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తింటే ఇంకా మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పరగడుపున బొప్పాయి పండు తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయిలోని ఎంజైమ్స్ ఆరోగ్యానికి అత్యంత మేలు చేయడమే కాకుండా.. ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినడం వల్ల.. చెడు కొలెస్ట్రాల్ దరి చేరకుండా వుంటుంది.
అంతేకాదు, కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. దాంతో, ఊబకాయం వున్న వారు పరగడుపున బొప్పాయి పండు తింటే బరువు తగ్గే అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
అంతేకాదు, జీర్ణ క్రియలో ఎటువంటి సమస్యలున్నా.. పరగడుపున బొప్పాయి పండు తినడం వల్ల క్యూర్ అయిపోతాయట. రోగ నిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణ క్రియ సక్రమంగా వుండడం వల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది. ఈ సమస్య వున్నవారు ఖచ్చితంగా బొప్పాయి పండు తింటే ఫలితం వుంటుందని నిపుణులు నిక్కర్చిగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు