సాయి పల్లవిపై వరుణ్ తేజ్ సంచలన కామెంట్లు.!
- February 27, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ‘ఫిదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఈ సినిమా మంచి విజయం అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా సెన్సేషనల్ అయ్యింది.
అయితే, ఆ తర్వాత ఈ జంట కలిసి నటించింది లేదు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవితో మళ్లీ స్ర్కీన్ షేర్ చేసుకోలేదెందుకు.? అనే ప్రశ్న వరుణ్ ముందుకొచ్చింది. అందుకాయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
మా కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ మూవీ ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమాలో మా పెయిర్కి మంచి రెస్పాన్స వచ్చింది కూడా. సో, ఆ తరహా కథ లేదంటే.. అంతకు మించిన కథ మా కాంబినేషన్లో ఇంతవరకూ సెట్ కాలేదు.
ఒకవేళ సెట్ అయితే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి నటిస్తామ్.. అని వరుణ్ తేజ్ చెప్పారు. సో, ఈ కాంబినేషన్ని దృస్టిలో పెట్టుకుని మన కథా రచయితలు కథ సిద్ధం చేస్తే ఈ బెస్ట్ పెయిర్ని మళ్లీ స్ర్కీన్పై చూసే అవకాశముందన్న మాట.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







