సాయి పల్లవిపై వరుణ్ తేజ్ సంచలన కామెంట్లు.!
- February 27, 2024మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ‘ఫిదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఈ సినిమా మంచి విజయం అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా సెన్సేషనల్ అయ్యింది.
అయితే, ఆ తర్వాత ఈ జంట కలిసి నటించింది లేదు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవితో మళ్లీ స్ర్కీన్ షేర్ చేసుకోలేదెందుకు.? అనే ప్రశ్న వరుణ్ ముందుకొచ్చింది. అందుకాయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
మా కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ మూవీ ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమాలో మా పెయిర్కి మంచి రెస్పాన్స వచ్చింది కూడా. సో, ఆ తరహా కథ లేదంటే.. అంతకు మించిన కథ మా కాంబినేషన్లో ఇంతవరకూ సెట్ కాలేదు.
ఒకవేళ సెట్ అయితే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి నటిస్తామ్.. అని వరుణ్ తేజ్ చెప్పారు. సో, ఈ కాంబినేషన్ని దృస్టిలో పెట్టుకుని మన కథా రచయితలు కథ సిద్ధం చేస్తే ఈ బెస్ట్ పెయిర్ని మళ్లీ స్ర్కీన్పై చూసే అవకాశముందన్న మాట.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు