సాయి పల్లవిపై వరుణ్ తేజ్ సంచలన కామెంట్లు.!
- February 27, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ‘ఫిదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఈ సినిమా మంచి విజయం అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా సెన్సేషనల్ అయ్యింది.
అయితే, ఆ తర్వాత ఈ జంట కలిసి నటించింది లేదు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవితో మళ్లీ స్ర్కీన్ షేర్ చేసుకోలేదెందుకు.? అనే ప్రశ్న వరుణ్ ముందుకొచ్చింది. అందుకాయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
మా కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ మూవీ ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమాలో మా పెయిర్కి మంచి రెస్పాన్స వచ్చింది కూడా. సో, ఆ తరహా కథ లేదంటే.. అంతకు మించిన కథ మా కాంబినేషన్లో ఇంతవరకూ సెట్ కాలేదు.
ఒకవేళ సెట్ అయితే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి నటిస్తామ్.. అని వరుణ్ తేజ్ చెప్పారు. సో, ఈ కాంబినేషన్ని దృస్టిలో పెట్టుకుని మన కథా రచయితలు కథ సిద్ధం చేస్తే ఈ బెస్ట్ పెయిర్ని మళ్లీ స్ర్కీన్పై చూసే అవకాశముందన్న మాట.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









