సాయి పల్లవిపై వరుణ్ తేజ్ సంచలన కామెంట్లు.!

- February 27, 2024 , by Maagulf
సాయి పల్లవిపై వరుణ్ తేజ్ సంచలన కామెంట్లు.!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ‘ఫిదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఈ సినిమా మంచి విజయం అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా సెన్సేషనల్ అయ్యింది.

అయితే, ఆ తర్వాత ఈ జంట కలిసి నటించింది లేదు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవితో మళ్లీ స్ర్కీన్ షేర్ చేసుకోలేదెందుకు.? అనే ప్రశ్న వరుణ్ ముందుకొచ్చింది. అందుకాయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

మా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫిదా’ మూవీ ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమాలో మా పెయిర్‌కి మంచి రెస్పాన్స వచ్చింది కూడా. సో, ఆ తరహా కథ లేదంటే.. అంతకు మించిన కథ మా కాంబినేషన్‌లో ఇంతవరకూ సెట్ కాలేదు.

ఒకవేళ సెట్ అయితే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి నటిస్తామ్.. అని వరుణ్ తేజ్ చెప్పారు. సో, ఈ కాంబినేషన్‌ని దృస్టిలో పెట్టుకుని మన కథా రచయితలు కథ సిద్ధం చేస్తే ఈ బెస్ట్ పెయిర్‌ని మళ్లీ స్ర్కీన్‌పై చూసే అవకాశముందన్న మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com