ఇట్స్ ఏన్ అఫీషియల్.! పేరెంట్స్ కాబోతున్న ఆ బాలీవుడ్ క్యూట్ జంట.!
- February 29, 2024
సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ వార్త ట్రెండింగే. వారి ప్రేమ వార్త కావచ్చు. పెళ్లి వార్త కావచ్చు.. అలాగే పిల్లలు పుట్టడం కావచ్చు.. ఇలా ఏది తీసుకున్నా సరే, అదో ట్రెండింగ్ న్యూసే.
ఆ లిస్టులోనే తాజాగా బాలీవుడ్ క్రేజీ పెయిర్ దీపికా పదుకొనె రణ్వీర్ సింగ్ జంట చేరింది. ఈ ఇద్దరూ 2013 ‘రామ్ లీలా’ టైమ్లో ప్రేమలో పడ్డారు. 2018లో పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా ఓ వైపు తమ వైవాహిక జీవితాన్నీ, అలాగే మరోవైపు కెరీర్ని సక్సెస్ఫుల్గా చక్కబెట్టుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ ట్రెండింగ్ న్యూస్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు జంటగా రణ్వీర్ అండ్ దీపికా. తమ ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టమనీ, ప్రస్తుతం ఆ సంతోషాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నామనీ తెలిపారు.
సెప్టెంబర్ కల్లా, జూనియర్ దీపికా లేదంటే, జూనియర్ రణ్వీర్ రాబోతున్నారనీ తమ పిల్లలను సినిమాటిక్ పద్ధతికి దూరంగా.. చాలా పద్ధతిగా పెంచాలని అనుకుంటున్నామనీ ఈ సందర్భంగా దీపికా రణ్వీర్ పేర్కొనడం విశేషం.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







