ఇట్స్ ఏన్ అఫీషియల్.! పేరెంట్స్ కాబోతున్న ఆ బాలీవుడ్ క్యూట్ జంట.!
- February 29, 2024
సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ వార్త ట్రెండింగే. వారి ప్రేమ వార్త కావచ్చు. పెళ్లి వార్త కావచ్చు.. అలాగే పిల్లలు పుట్టడం కావచ్చు.. ఇలా ఏది తీసుకున్నా సరే, అదో ట్రెండింగ్ న్యూసే.
ఆ లిస్టులోనే తాజాగా బాలీవుడ్ క్రేజీ పెయిర్ దీపికా పదుకొనె రణ్వీర్ సింగ్ జంట చేరింది. ఈ ఇద్దరూ 2013 ‘రామ్ లీలా’ టైమ్లో ప్రేమలో పడ్డారు. 2018లో పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా ఓ వైపు తమ వైవాహిక జీవితాన్నీ, అలాగే మరోవైపు కెరీర్ని సక్సెస్ఫుల్గా చక్కబెట్టుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ ట్రెండింగ్ న్యూస్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు జంటగా రణ్వీర్ అండ్ దీపికా. తమ ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టమనీ, ప్రస్తుతం ఆ సంతోషాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నామనీ తెలిపారు.
సెప్టెంబర్ కల్లా, జూనియర్ దీపికా లేదంటే, జూనియర్ రణ్వీర్ రాబోతున్నారనీ తమ పిల్లలను సినిమాటిక్ పద్ధతికి దూరంగా.. చాలా పద్ధతిగా పెంచాలని అనుకుంటున్నామనీ ఈ సందర్భంగా దీపికా రణ్వీర్ పేర్కొనడం విశేషం.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









