ఇట్స్ ఏన్ అఫీషియల్.! పేరెంట్స్ కాబోతున్న ఆ బాలీవుడ్ క్యూట్ జంట.!
- February 29, 2024సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ వార్త ట్రెండింగే. వారి ప్రేమ వార్త కావచ్చు. పెళ్లి వార్త కావచ్చు.. అలాగే పిల్లలు పుట్టడం కావచ్చు.. ఇలా ఏది తీసుకున్నా సరే, అదో ట్రెండింగ్ న్యూసే.
ఆ లిస్టులోనే తాజాగా బాలీవుడ్ క్రేజీ పెయిర్ దీపికా పదుకొనె రణ్వీర్ సింగ్ జంట చేరింది. ఈ ఇద్దరూ 2013 ‘రామ్ లీలా’ టైమ్లో ప్రేమలో పడ్డారు. 2018లో పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా ఓ వైపు తమ వైవాహిక జీవితాన్నీ, అలాగే మరోవైపు కెరీర్ని సక్సెస్ఫుల్గా చక్కబెట్టుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ ట్రెండింగ్ న్యూస్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు జంటగా రణ్వీర్ అండ్ దీపికా. తమ ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టమనీ, ప్రస్తుతం ఆ సంతోషాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నామనీ తెలిపారు.
సెప్టెంబర్ కల్లా, జూనియర్ దీపికా లేదంటే, జూనియర్ రణ్వీర్ రాబోతున్నారనీ తమ పిల్లలను సినిమాటిక్ పద్ధతికి దూరంగా.. చాలా పద్ధతిగా పెంచాలని అనుకుంటున్నామనీ ఈ సందర్భంగా దీపికా రణ్వీర్ పేర్కొనడం విశేషం.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..