అన్ని కంపెనీలు GDRFA ఆన్లైన్ సిస్టమ్ లో నమోదు చేయించుకోవాలి
- June 30, 2015
దుబాయిలో నడపబడుతున్న అన్ని కంపెనీలు, ఉద్యోగుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆన్ లైన్ ఇ-సర్వీసు పద్ధతిని -రెసిడెన్సీ జారీకి, రెన్యువల్ కొరకు, వర్క్ పర్మిట్ మరియు విజిట్-వీసా దరఖాస్తుల మాన్యువల్ దరఖాస్తుకు బదులుగా మాత్రమే వాడాలని అక్కడి జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫేర్స్ (GDRFA) యొక్క డైరక్టర్ జనరల్ - మేజర్ జనరల్ మొహమ్మద్ ఆహ్మైద్ అల్ మర్రి తెలిపారు. GDRFA సేవలను వినియోగించుకోవడానికి ముందుగా అన్ని కంపెనీలు ఆన్లైన్ సిస్టమ్ కొరకు నమోదు చేయించుకోవాలని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ సేవలలోకి మారటం అనేది వినియోగదారుల కొరకు సేవలను అభివృద్ధి పరచి, సౌకర్యవంతంగా చేయడానికి మరియు పద్ధతులను సరళంగా చేయడానికేనని ఆయన స్పష్టంచేశారు. వినియోగదారుల సమయాన్ని, శ్రమను తగ్గించడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









