కీర్తి సురేష్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారుగా.!
- April 26, 2024
‘మహానటి’ సినిమాతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది అందాల భామ కీర్తి సురేష్. ఎలాంటి టఫ్ రోల్ అయినా కీర్తి సురేష్ ముందు మోకరిల్లాల్సిందే.. అనేంతలా ఆ సినిమాతో తన ఇమేజ్ని పెంచుకుంది.
ఆ తర్వాత నుంచి కీర్తి సురేష్ చేసిన ప్రాజెక్టులు కూడా ఆ కోవకు చెందినవే కావడం విశేషం. అయితే, ‘సర్కారు వారి పాట’ సినిమా కీర్తి సురేష్ ఇమేజ్ని డ్యామేజ్ చేసిందనాలా.? లేక కమర్షియల్ హీరోయిన్గా తన ఇమేజ్ని మరింత రెట్టింపు చేసిందనాలా.? తెలీదు కానీ, మహానటిలో మార్పు బీభత్సంగా వచ్చేసింది.
మార్పు మంచిదే. కానీ, ఇప్పుడు కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు కారణం ఆమె బాలీవుడ్ సినిమా.
బాలీవుడ్లో కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన పోస్టర్లు ఈ మధ్య నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లలో కీర్తి సురేష్ ఓ రేంజ్లో గ్లామర్ ఒలకబోసేస్తోంది. ఇంతవరకూ గ్లామర్కి దూరంగా వున్న మహానటి.. బాలీవుడ్కి వెళ్లాకా గ్లామర్ కంచెలు తెంచేసిందంటూ నెటిజనం విస్తుపోతున్నారు.
‘సర్కారు వారి పాట’ సినిమా నుంచే కీర్తి సురేష్ గ్లామర్ తెరలకు బాగా పని చెప్పింది. ఇక, ఇప్పుడు బాలీవుడ్కి వెళ్లాకా.. బొత్తిగా తన సంస్కారం వదిలేసిందంటూ.. ఇంతవరకూ ఆమెను అమితంగా అభిమానించిన వాళ్లే దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







