కీర్తి సురేష్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారుగా.!
- April 26, 2024
‘మహానటి’ సినిమాతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది అందాల భామ కీర్తి సురేష్. ఎలాంటి టఫ్ రోల్ అయినా కీర్తి సురేష్ ముందు మోకరిల్లాల్సిందే.. అనేంతలా ఆ సినిమాతో తన ఇమేజ్ని పెంచుకుంది.
ఆ తర్వాత నుంచి కీర్తి సురేష్ చేసిన ప్రాజెక్టులు కూడా ఆ కోవకు చెందినవే కావడం విశేషం. అయితే, ‘సర్కారు వారి పాట’ సినిమా కీర్తి సురేష్ ఇమేజ్ని డ్యామేజ్ చేసిందనాలా.? లేక కమర్షియల్ హీరోయిన్గా తన ఇమేజ్ని మరింత రెట్టింపు చేసిందనాలా.? తెలీదు కానీ, మహానటిలో మార్పు బీభత్సంగా వచ్చేసింది.
మార్పు మంచిదే. కానీ, ఇప్పుడు కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు కారణం ఆమె బాలీవుడ్ సినిమా.
బాలీవుడ్లో కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన పోస్టర్లు ఈ మధ్య నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లలో కీర్తి సురేష్ ఓ రేంజ్లో గ్లామర్ ఒలకబోసేస్తోంది. ఇంతవరకూ గ్లామర్కి దూరంగా వున్న మహానటి.. బాలీవుడ్కి వెళ్లాకా గ్లామర్ కంచెలు తెంచేసిందంటూ నెటిజనం విస్తుపోతున్నారు.
‘సర్కారు వారి పాట’ సినిమా నుంచే కీర్తి సురేష్ గ్లామర్ తెరలకు బాగా పని చెప్పింది. ఇక, ఇప్పుడు బాలీవుడ్కి వెళ్లాకా.. బొత్తిగా తన సంస్కారం వదిలేసిందంటూ.. ఇంతవరకూ ఆమెను అమితంగా అభిమానించిన వాళ్లే దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







