శినాయి (ఈజిప్టు)లో టెర్రరిస్తు దాడి: తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్ స్పీకర్

- July 02, 2015 , by Maagulf
శినాయి (ఈజిప్టు)లో టెర్రరిస్తు దాడి: తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్ స్పీకర్

నేడు శినాయిలో 17 మంది సైనికులను, అధికారులను బలిగొన్న టెర్రరిస్టు దాడిని, కౌన్సిల్ ఆఫ్ రెప్రజంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ ఇబ్రహీం అల్-ముల్లా తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ శాంతిభద్రతలకు భంగం కలిగించేటి ఏ రూపంలోని తీవ్రవాదాన్నైనా తిరస్కరించవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

ఈజిప్టు ప్రజల మరియు నాయకత్వం యొక్క స్థిరచిత్తాన్ని తీవ్రవాద మరియు ప్రతికూల శక్తులు కదిలించలేవని ఆయన స్పష్టం చేస్తూ, తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఈజిప్టుకు సహాయమాందిచవలసిందిగా అంతర్జాతీయ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అటర్నీ జనరల్ హిషాయమ్ బరకత్ మృతికి చింతిస్త్తూ, వారి కుటుంబాలకు ధైర్య స్థైర్యాలు కలిగించవలసిందిగా భగవంతుని ప్రార్ధిoచారు, బాధిత కుటుంబాలకు, ప్రజలకు, ఈజిప్టు ప్రభుత్వానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com