గోదావరి పుష్కరాలకు 'చరణ్' విమానాలు
- July 02, 2015
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. టర్భో మెగా ఎయిర్ లైన్స్ సంస్థ.... 'ట్రు జెట్' బ్రాండ్ పేరుతో చార్టెడ్ ఫ్లైట్లను నడుపబోతోంది. ఈ సంస్థ డైరెక్టర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అతడే. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం....ఈ విమాన సంస్థ గోదావరి పుష్కరాలకు విమాన సర్వీసులు నడపాలని యోచిస్తోంది. ఈ మేరకు పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానయాన శాఖ నుండి అనుమతులు రాగానే సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తిరుపతి, బెంగుళూరు, షిర్డిలకు ఈ విమాన సర్వీలు తొలుత నడపాలని ప్లాన్ చేస్తారు. అయితే గోదావరి పుష్కరాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ మేరకు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని మిని ఏరోప్లేన్స్ కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







