గోదావరి పుష్కరాలకు 'చరణ్' విమానాలు

- July 02, 2015 , by Maagulf
గోదావరి పుష్కరాలకు 'చరణ్' విమానాలు

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. టర్భో మెగా ఎయిర్ లైన్స్ సంస్థ.... 'ట్రు జెట్' బ్రాండ్ పేరుతో చార్టెడ్ ఫ్లైట్లను నడుపబోతోంది. ఈ సంస్థ డైరెక్టర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అతడే. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం....ఈ విమాన సంస్థ గోదావరి పుష్కరాలకు విమాన సర్వీసులు నడపాలని యోచిస్తోంది. ఈ మేరకు పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానయాన శాఖ నుండి అనుమతులు రాగానే సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తిరుపతి, బెంగుళూరు, షిర్డిలకు ఈ విమాన సర్వీలు తొలుత నడపాలని ప్లాన్ చేస్తారు. అయితే గోదావరి పుష్కరాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ మేరకు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని మిని ఏరోప్లేన్స్ కొనుగోలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com