రాయబారులతో ప్రమాణం చేయించిన క్రౌన్ ప్రిన్స్ ..!
- August 28, 2024
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ వివిధ దేశాలకు నియమితులైన రాయబారులతో రియాద్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలోఒమన్కు నియమితులైన రాయబారి ఇబ్రహీం బిన్ సాద్ బిన్ బిషన్, మౌరిటానియా రాయబారి డా. అబ్దుల్ అజీజ్ అల్-రఖాబీ, ఉక్రెయిన్కు నియమితులైన రాయబారి మొహమ్మద్ అల్-బరాకా, సైప్రస్కు నియమితులైన ఫవాజ్ అల్-షబిలి, కామెరూన్కు నియమితులై రాయబారి ఇబ్రహీం అల్-గమ్ది, ఐర్లాండ్కు రాయబారిగా నియమితులైన హసన్ అల్-జామీ, సబ్ర్కు రాయబారిగా నియమితులైన మాలి అబ్దుల్లా బిన్ సలేహ్ ప్రమాణం చేశారు. విదేశాలలో సౌదీ అరేబియా ప్రయోజనాలను కాపాడతామని, నిజాయితీ, చిత్తశుద్ధితో సేవలు అందిస్తామని రాయబారులు ప్రమాణం చేసారు. విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









