ఘనంగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుక.!
- September 02, 2024
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా జరిగిన ఈ వేడకకు చిరంజీవి గెస్ట్గా రావడంతో పాటూ, విక్టరీ వెంకటేష్ కూడా విచ్చేశారు. అయితే, ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా విచ్చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, అల్లు అర్జున్ హాజరు కాలేదు.
అలాగే ఎన్టీయార్ కూడా ఈ వేడకలో కనిపించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవరాల్గా చూస్తే ఈ జనరేష్ హీరోలెవ్వరూ ఈ వేడకకు హాజరు కాలేదు. కాగా, ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యనుద్దేశించి చేసిన స్పీచ్ అద్భుతంగా వుందని మాట్లాడుకుంటున్నారు.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్.. ఇలా ముగ్గురు సీనియర్ హీరోలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు పండగలా అనిపిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







