బహ్రెయిన్ లో ‘వీట్ బ్రాన్’ బ్లాక్ మార్కెట్.. డబుల్ ధరలకు విక్రయం..!!
- October 13, 2024
మనామా: బహ్రెయిన్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ (BFMC) పశువుల పెంపకందారులకు కేటాయించిన స్థానికంగా "శ్వర్" అని పిలువబడే సబ్సిడీ గోధుమ ఊక(వీట్ బ్రాన్) అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది వ్యాపారాల నెట్వర్క్ లాభాపేక్ష కోసం ప్రభుత్వ మద్దతు వ్యవస్థను పక్కదారి పట్టిస్తోందని, అధికారిక ధరల కంటే రెట్టింపు ధరలకు చట్టవిరుద్ధంగా రీసేల్ చేస్తున్నారని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ విక్రేతలు ఒక్కో బ్యాగ్కు 6 బిడి వరకు వసూలు చేస్తున్నారని, ఇది అధికారిక రేటు కంటే రెట్టింపు ధర అని BFMC విడుదలచేసిన నివేదికలో వెల్లడించింది. దీనిపై BFMC అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లబ్ధిదారులు కోరుతున్నారు. చాలా మంది రైతులు తమ వాటాను BFMC నుండి కాకుండా దళారుల నుంచి తీసుకుంటున్నారని, మోసం జరిగేందుకు ఇది ఒక కారణమని అధికారులు తెలిపారు. దళారులు రైతుల తరపున వీట్ బ్రాన్ కొనుగోలు చేసి తమ ఇంటి వద్దకే అందజేస్తున్నారని రైతులు తెలిపారు. రైతు కోరినన్ని బస్తాలు ఇస్తున్నారని ఇది రైతులను వారి ఉచ్చులో పడేందుకు ఒక కారణమని తెలిపారు. కొంతకాలంగా ఈ చట్టవిరుద్ధమైన కొనుగోళ్లు పెరిగాయని, దాంతో చిన్న-స్థాయి రైతులకు ప్రభత్వం అందజేసే ప్రయోజనం దూరంఅవుతుందని రైతులు ధృవీకరించారు. బ్లాక్ మార్కెట్ బహ్రెయిన్ పశువుల పెంపకం రంగానికి హాని కలిగిస్తోందని, అనవసరమైన ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని BFMC అధికారులను కోరుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







