జజాన్ సముద్రంలో సౌదీ కుటుంబాన్ని రక్షించిన బోర్డర్ గార్డ్..
- November 04, 2024
రియాద్: జజాన్ ప్రాంతంలో బోర్డర్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సముద్రంలో మునిగిపోతున్న సౌదీ కుటుంబాన్ని రక్షించారు. నిషేధిత ప్రాంతాల్లో ఈత కొడుతూ మునిగిపోతున్న సౌదీ పౌరుడు, అతని ఇద్దరు కుమార్తెలను రెస్క్యూ టీమ్ రక్షించింది. వారికి అవసరమైన సహాయాన్ని అందించి సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. సందర్శకులు, విహారయాత్రకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టడం ద్వారా సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ కోరింది. అత్యవసర సహాయం కోసం మక్కా,తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్కు.. కింగ్డమ్లోని ఇతర ప్రాంతాలలో 994 నంబర్ను సంప్రదించాలని డైరెక్టరేట్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









