రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌

- March 05, 2025 , by Maagulf
రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌

విశాఖపట్నం: రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కి విశాఖపట్నం విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన హోమ్ మంత్రి అనిత.ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపులలో ప్రాధాన్యత కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ కు రూ.3,295 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించినందుకు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com