టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం

- April 11, 2025 , by Maagulf
టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం

తిరుపతి: టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాద‌ని టిటిడి అధికారులు ప్ర‌క‌టించారు. మృతి చెందిన గోవులు పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావ‌ని అన్నారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామ‌ని, ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టిటిడి అధికారులు భ‌క్తుల‌ను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com