ముగిసిన పర్యటన..నెదర్లాండ్స్ నుండి బయలుదేరిన HM సుల్తాన్..!!
- April 17, 2025
ఒమన్ః మూడు రోజుల నెదర్లాండ్స్ ముగించుకొని సుల్తాన్ హైతం బిన్ తారిక్ బయలుదేరారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం షిపోల్ వద్ద రాజు సైనిక భవనం అధిపతి రియర్ అడ్మిరల్ లడ్జర్ బ్రుమ్మెలార్, విదేశీ వాణిజ్యం అభివృద్ధి మంత్రి రీనెట్ క్లేవర్, నెదర్లాండ్స్లోని కొంతమంది అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. అనంతరం సుల్తాన్ హైతం బిన్ తారిక్ నెదర్లాండ్స్ రాజు విల్లెం-అలెగ్జాండర్, ఆయన భార్య రాణి మాక్సిమాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక కేబుల్ పంపారు.
కేబుల్లో.. తనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి అందించిన హృదయపూర్వక స్వాగతం, ఆతిథ్యానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజు , ప్రధానమంత్రితో తన సమావేశం ఫలితాలను ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో సుల్తాన్ తో పాటు రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్, రాయల్ కోర్ట్ దివాన్ మంత్రి సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైది, రాయల్ ఆఫీస్ మంత్రి జనరల్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ నుమానీ, విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది, ప్రైవేట్ ఆఫీస్ అధిపతి డాక్టర్ హమద్ బిన్ సయ్యద్ అల్ ఔఫీ, విద్యా మంత్రి డాక్టర్ మదీహా బింట్ అహ్మద్ అల్ షైబానీ, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుస్సలాం బిన్ మొహమ్మద్ అల్ ముర్షిది, ఇంధనం ఖనిజాల మంత్రి ఇంజినీర్ సలీం బిన్ నాసిర్ అల్ ఔఫీ, నెదర్లాండ్స్లోని ఒమన్ రాయబారి షేక్ డాక్టర్ అబ్దుల్లా బిన్ సలీం అల్ హార్తీ వంటి ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం ఉన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్