యూఏఈ లాటరీ..1 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు..!!
- May 14, 2025
యూఏఈ: దుబాయ్లో నివసిస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసులు ఆనంద్ పెరుమల్సామి.. యూఏఈ లాటరీలో 1 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నారు.అతనికి టీ అంటే ఇష్టం. లాటరీ టిక్కెట్ కోసం టీని తాగకుండా డబ్బులు ఆదా చేసినట్లు తమిళనాడుకు చెందిన అతను చెప్పాడు. 2017 నుండి దుబాయ్లో నివసిస్తున్న అనంత్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు.
“గత సంవత్సరం నవంబర్లో నేను మొదటిసారి యూఏఈ లాటరీ గురించి విన్న. అది ఆసక్తికరంగా అనిపించింది. ఫ్రెండ్స్ తో కలిసి డబ్బును షేర్ చేసుకొని టికెట్ కొనాలని నిర్ణయించుకున్నాము." అని అతను చెప్పాడు.12 మంది స్నేహితులు, సహోద్యోగులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాము ప్రతి పక్షం రోజులకు ఒక్కొక్కరికి 8 Dhs పూల్ చేసి రెండు టిక్కెట్లు కొనాలని నిర్ణయించుకున్నాము. ఒక్కో టికెట్ ధర Dh50 అని అతను వివరించాడు. అంటే నేను నెలకు Dh16 మాత్రమే ఖర్చు చేస్తాను, అంటే 12 నుండి 16 కప్పుల టీ వదులుకున్నట్లే అని వివరిండాడు.
“ప్రతి ఫలితం రోజు, నేను రాత్రి 9 గంటలకు యాప్ని తనిఖీ చేస్తాను. ఆ రోజు, లైవ్ షో తర్వాత, నిద్రపోయే ముందు యాప్ని తెరిచాను. నాకు చాలా నిద్ర వస్తుంది, కానీ చివరిసారిగా ఒకసారి తనిఖీ చేయాలనుకున్నాను. మేము గెలిచామని చూసినప్పుడు, నేను షాక్ అయ్యాను. ఆ రాత్రి లేదా మరుసటి రోజు నేను నిద్రపోలేదు. గ్రూప్ సభ్యులలో చాలా మంది త్వరగా పడుకున్నారు. అనంత్ ఈ వార్తను పంచుకునేటప్పుడు కొందరు ఇంకా మేల్కొని ఉన్నారు. నేను తమాషా చేస్తున్నానని వారు అనుకున్నారు.” అని అతను చెప్పాడు.
బహుమతి డబ్బును 12 మంది సభ్యుల మధ్య విభజించగా, ఒక్కొక్కరికి Dh85,000 నుండి Dh100,000 వరకు వస్తుందని తెలిపారు. వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్న అనంత్కి ఇంతకంటే మంచి సమయం లేదని హర్షం వ్యక్తం చేశాడు. "కొందరు ఇల్లు కట్టుకోవాలని, మరికొందరు తమ పిల్లల చదువు కోసం చెల్లించాలని, అప్పులు తీర్చాలని లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటారు." అని వెల్లడించారు.
ఇంకా 100 మిలియన్ దిర్హాములు గ్రాండ్ ప్రైజ్ ఇప్పటికీ క్లెయిమ్ చేయలేదు.పాల్గొనేవారు ఆ మొత్తాన్ని గెలుచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్