భారీగా నార్కొటిక్ పిల్స్ రవాణా..అడ్డుకున్న సౌదీ అధికారులు..!!
- June 13, 2025
అల్-వాడియా: సనా నుండి సౌదీ అరేబియాకు తరలిస్తున్న భారీ నార్కొటిక్ పిల్స్ ను అడ్డుకున్నట్లు యెమెన్ సరిహద్దు అధికారులు ప్రకటించారు. సౌదీ-యెమెన్ సరిహద్దు క్రాసింగ్ వద్ద రిఫ్రిజిరేటెడ్ ట్రక్కు పైకప్పు లోపల దాచిన 1.5 మిలియన్లకు పైగా పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అల్-వాడియా బోర్డర్ క్రాసింగ్లోని బోర్డర్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ బెటాలియన్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఒమైర్ అల్-అజాబ్ మాట్లాడుతూ.. రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో ఈ పిల్స్ ను దాచి ఉంచినట్లు గుర్తించారు. "పిల్స్ రవాణా యెమెన్ రాజధాని సనాలోని మాదకద్రవ్యాల డీలర్లకు చెందినదని గుర్తించాం. వాటిని సౌదీ అరేబియాలోని షరూరా నగరానికి డెలివరీ చేస్తున్నారు. స్వాధీనం చేసుకుని, వాహన డ్రైవర్ పై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమర్థ అధికారులకు అప్పగించారు." అని బ్రిగేడియర్ జనరల్ అల్-అజాబ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్