ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించడానికి ఒమన్ ప్రయత్నాలు..!!
- June 19, 2025
మస్కట్: ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన కార్యకలాపాలను ఒమన్ ప్రారంభించింది. గాజా, ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులతో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఒమన్ విదేశాంగ మంత్రి హిజ్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ అల్ బుసైది.. జర్మన్ విదేశాంగ మంత్రి అధికారిక పర్యటన సందర్భంగా మస్కట్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రాంతీయ సంక్షోభంపై వారు చర్చించారు. ముఖ్యంగా గాజాలో నిరంతర హింస, విధ్వంసంతో పాటు అనేక మంది ప్రాణనష్టానికి కారణమైన ఇజ్రాయెల్.. తాజాగా ఇరానియన్ మౌలిక సదుపాయాలపై దాడుల చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి.
అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించడం, జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించడంతోపాటు రెండు-స్టేట్స్ పరిష్కారానికి మద్దతును తిరిగి పెంచడం అత్యవసరమని ఇద్దరు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు పాలస్తీనా రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపును విస్తృతం చేయడం, ప్రాంతీయ స్థిరత్వానికి ఏకైక అనుసరణీయ మార్గం అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో అల్-బుసైది మిత్ర దేశాల విదేశాంగ మంత్రులతో వరుసగా ఫోన్ కాల్స్ చేస్తూ.. ఇజ్రాయెల్ కార్యకలాపాలను నిలిపివేయడానికి అవసరమైన రాజకీయ ఒత్తిడి కోసం కృషి చస్తున్నారు. ఈ ప్రయత్నాలు శాంతి, న్యాయం, అంతర్జాతీయ చట్టానికి మద్దతుగా ఒమన్ వైఖరిని ప్రతిబింబిస్తాయని తెలిపారు.
ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణను అరికట్టడానికి ఒమన్ తన బలమైన దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఒమన్ సైనిక, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండించింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్య మార్గంలో ప్రయాత్నించాలని సూచించింది.
ఇజ్రాయెల్ దురాక్రమణదారు అని, UN చార్టర్ను ఉల్లంఘిస్తోందని మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అం అణు విస్తరణను నిరోధించే లక్ష్యంతో అమెరికా-ఇరానియన్ చర్చలు సహా శాంతి ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ముందస్తు కాల్పుల విరమణ చాలా ముఖ్యమైనదని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..