ఒమన్ లో విషాదం.. బస్సు బోల్తా.. డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి..!!

- July 02, 2025 , by Maagulf
ఒమన్ లో విషాదం.. బస్సు బోల్తా.. డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి..!!

మస్కట్: ఇజ్కిలోని అల్-రుసైస్ ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 12 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో అనేక మంది పిల్లలు ఉన్నారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బలమైన వస్తువును ఢీకొని బస్సు బోల్తా పడిందని, దాంతోప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.  కాగా, ప్రమాదం, గాయపడిన పిల్లల పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com