షార్జాలో రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటిక్ విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్..!!
- July 07, 2025
షార్జా: షార్జా నివాసితులు అద్దె ఒప్పందాన్ని నమోదు చేసుకున్న తర్వాత విద్యుత్, నీరు లేదా గ్యాస్ సేవలను వెంటనే అందుతాయని, ఇకపై ప్రత్యేక దరఖాస్తులను దాఖలు చేయవలసిన అవసరం లేదని షార్జా విద్యుత్, నీరు, గ్యాస్ అథారిటీ (సేవా) తెలిపింది. ఈమేరకు షార్జా మునిసిపాలిటీల కొత్తగా ఉమ్మడి ప్రక్రియను తీసుకొచ్చినట్లు పేర్కొంది.
మున్సిపాలిటీ లీజును ధృవీకరించిన తర్వాత, అద్దెదారులకు మెసేజ్ అందుతుందన్నారు. డిపాజిట్ డబ్బు చెల్లించిన వెంటనే, ప్రత్యేక అభ్యర్థన అవసరం లేకుండా సేవా సేవలు యాక్టివేట్ అవుతాయని అన్నారు. రెండు సంస్థల మధ్య ఇంటిగ్రేటెడ్ ఇ-లింక్ వ్యవస్థ కారణంగా ఇది అమలు అవుతుందని సేవా కస్టమర్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ హుస్సేన్ అల్ అస్కర్ అన్నారు.
అయితే, గతంలో షార్జాలోని అద్దెదారులు మొదట మునిసిపాలిటీలో వారి అద్దె ఒప్పందాన్ని ధృవీకరించాలి.ఆపై సర్వీస్ యాక్టివేషన్ను అభ్యర్థించడానికి షార్జా విద్యుత్, నీరు, గ్యాస్ అథారిటీ (సేవా)ని సందర్శించాలి లేదా విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో ధృవీకరించబడిన ఒప్పంద పత్రాలు, ఎమిరేట్స్ ID వంటి పత్రాలను సమర్పించడం, యుటిలిటీలను కనెక్ట్ చేయడానికి ముందు భద్రతా డిపాజిట్ చెల్లించడం వంటివి ఉన్నాయి. దీనికి చాలా రోజులు పడేదని తెలిపారు. ఈ చొరవ అద్దెదారులు, ఇంటి యజమానులకు సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుందని వివరించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్