జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ లో ప్రారంభం..!!
- July 11, 2025
అబుదాబి: డిసెంబర్లో జాయెద్ నేషనల్ మ్యూజియం ప్రారంభం కానుంది. దీనిని యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ గౌరవార్థం నిర్మిస్తున్నారు. ఫోస్టర్ + పార్టనర్స్కు చెందిన ప్రిట్జ్కర్ బహుమతి గ్రహీత ఆర్కిటెక్ట్ లార్డ్ నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ఈ మ్యూజియం డిజైన్ యూఏఈ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
సందర్శకులు 300,000 సంవత్సరాల మానవ చరిత్రను తెలుసుకునేలా రెండు అంతస్తులలో ఆరు శాశ్వత గ్యాలరీలను, అలాగే తాత్కాలిక ప్రదర్శన గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. మ్యూజియం సేకరణలో యూఏఈ వ్యాప్తంగా సేకరించిన కళాఖండాలు ఉన్నాయి. ప్రపంచంలోని పురాతన సహజ ముత్యాలలో ఒకటైన అబుదాబి పెర్ల్ను ఇక్కడ చూడవచ్చు. అదే సమయంలో అరేబియా గల్ఫ్లో ముత్యాల వేట చరిత్రను తెలుసుకోవచ్చు. ప్రాచీన ఖురాన్ మాన్యుస్క్రిప్ట్లలో ఒకటైన బ్లూ ఖురాన్ ను ఇక్కడచూడవచ్చు. మ్యూజియం సేకరణలో పాలియోలిథిక్, నియోలిథిక్, కాంస్య , ఇనుప యుగం కళాఖండాలు ఉన్నాయని తెలిపారు.
“యూఏఈ జాతీయ మ్యూజియంగా, జాయెద్ నేషనల్ మ్యూజియం మన వ్యవస్థాపక పితామహుడు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వారసత్వం. ఇది ప్రజలపై, వారి నేర్చుకునే సామర్థ్యంలో ఐక్యత, జాతీయ విలువలను నిలబెట్టడంలో ఆయనకున్న అపరిమితమైన నమ్మకానికి నివాళి. భవిష్యత్ తరాలకు ఒక గుర్తింపుకు ఒక వెలుగు. ఈ సంస్థ మన కథను రాబోయే తరాలకు ముందుకు తీసుకువెళుతుంది.’’ అని అబుదాబిలోని సంస్కృతి, పర్యాటక శాఖ ఛైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్