సోషల్ మీడియాలో ట్రేడింగ్ స్కామ్.. ముఠా అరెస్టు..!!
- July 21, 2025
దుబాయ్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా నకిలీ ట్రేడింగ్, పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం ద్వారా ఆన్లైన్ మోసానికి పాల్పడిన ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఫోన్ కాల్స్ మరియు సోషల్ మీడియా ప్రకటనల ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకుని, ప్రసిద్ధ ట్రేడింగ్ , పెట్టుబడి ప్లాట్ఫామ్ల పేరిట నిందితులు మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి చేతిలో మోసపోయిన వ్యక్తుల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.
ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇటీవలి నెలల్లో వందలాది మంది పెట్టుబడిదారులను ఆర్థికంగా నష్టపరిచిన సిగ్మా-వన్ క్యాపిటల్, డట్ఎఫ్ఎక్స్, ఇవిఎం ప్రైమ్, యుట్రేడ్, ఇవిఎ మార్కెట్లు, కోర్ ఫైనాన్షియల్ మార్కెట్లతో సహా మోసపూరిత ప్లాట్ఫారమ్ల వెనుక సిండికేట్ ఉందని తెలిపారు. పదివేల మంది యూఏఈ నివాసితులు నకిలీ పెట్టుబడి ప్రణాళికలకు తమ జీవిత పొదుపులను కోల్పోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను eCrime ప్లాట్ఫామ్, దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా లేదా 901ని సంప్రదించడం ద్వారా నివేదించాలని నివాసితులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్