బహ్రెయిన్ లో ఎలక్ట్రానిక్ పార్శిల్ లాకర్లు ప్రారంభం..!!
- September 02, 2025
మనామా: బహ్రెయిన్ పోస్ట్ ఆధ్వర్యంలో కొత్త ఎలక్ట్రానిక్ లాకర్ సర్వీసును రవాణా మరియు టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇది పోస్టల్ సేవలను ఆధునీకరించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని మంత్రిత్వ శాఖలోని భూ రవాణా మరియు పోస్టల్ సేవల అండర్ సెక్రటరీ ఫాతిమా అబ్దుల్లా అల్-దాఆన్ తెలిపారు. వ్యక్తులు మరియు వ్యాపారాల అవసరాలను తీర్చడానికి పార్శిల్ సేకరణ కోసం లాకర్లు ఆచరణాత్మకమైన ఎంపికలను అందిస్తాయని చెప్పారు.
ఎలక్ట్రానిక్ లాకర్లు కస్టమర్లు నిర్దిష్ట సమయాలకు లేదా పోస్టాఫీసులను సందర్శించకుండా సురక్షితంగా మరియు వారి సౌలభ్యం మేరకు పార్శిల్లను స్వీకరించడానికి అనుమతిస్తాయని అల్-దాఆన్ వివరించారు. కస్టమర్లు ప్రత్యేకమైన కోడ్ మరియు లాకర్ స్థానాన్ని అందుకుంటారని, అదే కోడ్ని ఉపయోగించి పార్శిల్ను సేకరించవచ్చన్నారు. లాకర్లను వ్యూహాత్మకంగా ప్రధాన వాణిజ్య కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం సీఫ్ మాల్, మారస్సీ గల్లెరియా, ది అవెన్యూస్, సౌక్ అల్-బర్రాహా, డ్రాగన్ సిటీ మరియు సార్ మాల్ లో అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలో మరిన్ని ప్రదేశాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









