ఒడిశాలో పిడుగుపాటుకు బలైన వారి సంఖ్య 56కు...
- August 03, 2016
మరో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో ఒడిశాలో పిడుగుపాటుకు బలైన వారి సంఖ్య 56కు చేరుకుంది. మంగళవారం బోలంగీర్, జగత్సింగ్పూర్, కుర్దా, కటక్లలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు చనిపోవడంతో గత నాలుగు రోజుల్లో పిడుగుపాటు ప్రమాదంతో చనిసోయిన వారి సంఖ్య 56కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. జులై 30నాటికి మృతుల సంఖ్య 41 ఉండగా 31న మరో 11మరణాలు నమోదయ్యాయి. ఒక్క బాలసోర్ జిల్లాలోనే 8 మంది చనిపోగా, భద్రక్, మయూర్భంజ్, కుర్దా జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కటక్లో ఆరుగురు, జైపూర్, దెంకనల్ జిల్లాల్లో నలుగురు చొప్పున, కియోంఝర్, నబరంగ్పూర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నయగార్లో ముగ్గురు, పూరీ, దియోగ్రా, కేంద్రపరా, జర్సుగూడ, బోలంగీర్, జగత్సింగ్పూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 56 మంది మృతి చెందినట్లు అధికారులు వివరించారు. కాగా.. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







