ఒడిశాలో పిడుగుపాటుకు బలైన వారి సంఖ్య 56కు...
- August 03, 2016
మరో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో ఒడిశాలో పిడుగుపాటుకు బలైన వారి సంఖ్య 56కు చేరుకుంది. మంగళవారం బోలంగీర్, జగత్సింగ్పూర్, కుర్దా, కటక్లలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు చనిపోవడంతో గత నాలుగు రోజుల్లో పిడుగుపాటు ప్రమాదంతో చనిసోయిన వారి సంఖ్య 56కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. జులై 30నాటికి మృతుల సంఖ్య 41 ఉండగా 31న మరో 11మరణాలు నమోదయ్యాయి. ఒక్క బాలసోర్ జిల్లాలోనే 8 మంది చనిపోగా, భద్రక్, మయూర్భంజ్, కుర్దా జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కటక్లో ఆరుగురు, జైపూర్, దెంకనల్ జిల్లాల్లో నలుగురు చొప్పున, కియోంఝర్, నబరంగ్పూర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నయగార్లో ముగ్గురు, పూరీ, దియోగ్రా, కేంద్రపరా, జర్సుగూడ, బోలంగీర్, జగత్సింగ్పూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 56 మంది మృతి చెందినట్లు అధికారులు వివరించారు. కాగా.. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







