బెంగళూరులో 40 ప్రైవేటు బస్సులకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
- September 12, 2016
కావేరీ జలాల వివాదంతో బెంగళూరు నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. నిరసనకారులు మరోసారి రెచ్చిపోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. కేపీఎస్ బస్టాండులో ఉన్న తమిళనాడుకు చెందిన 40 ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ ఘటనలో కేటీఎస్ ట్రావెల్స్కు చెందిన 38 బస్సులు, ఎస్ఆర్ఎస్కు చెందిన మరో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం నగరంలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించారు. బెంగళూరులో 10 కంపెనీల సీఆర్పీఎఫ్, 10 కంపెనీల ఆర్ఏఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దాదాపు 200 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరు, మైసూరు, మాండ్యా ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక మంత్రి మండలి మంగళవారం అత్యవసరంగా భేటీ కానుంది.
తమిళనాడుకు 12వేల క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈరోజు ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. బెంగళూరులో, మైసూర్ వెళ్లే జాతీయ రహదారిపై ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
నిరసనకారులు తమిళనాడు వాహనాలు, బస్సులను తగలబెడుతున్నారు. షాపులను ధ్వంసం చేస్తున్నారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు బస్సులను నిలిపేశారు. తమిళనాడు బస్సులను కూడా కర్ణాటకకు రానియ్యట్లేదు.
బెంగళూరులో మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిపేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







