తలైవా '2.0' సెట్లో..
- January 02, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'రోబో'కి సీక్వెల్గా శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. ఈ చిత్రం సెట్లో తీసిన ఒక ఫొటోను శంకర్ సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. '2.0'17.. అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2017లో అత్యంత భారీ బడ్జెట్తో విడుదలౌతోన్న చిత్రాల్లో '2.0' ఒకటి. దాదాపు రూ. 400 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషించడం మరో ఆసక్తికర అంశం. .
ఇటీవల ఈ చిత్రం ఫస్ట్లుక్ను ముంబయిలో విడుదల చేశారు.
ప్రస్తుతం చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, చైనీస్ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ '2.0'కి స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







