తెలంగాణా కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్ లు ఖరారు
- October 28, 2020
హైదరాబాద్:తెలంగాణలో సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చి వేసిన ప్రభుత్వం.. ఆ స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. కొత్త సెక్రటేరియట్ భవన నమూనాని కూడా సీఎం ఫైనల్ చేసేశారు. ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ తయారు చేసిన నమూనాను కొన్ని మార్పులతో సీఎం ఖరారు చేసారు. ఆధునిక హంగులతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణ హితంగా కొత్త సచివాలయం ఉండనుంది. ఈ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి గత నెలలో టెండర్లు ఆహ్వానించింది రోడ్లు భవనాల శాఖ. నిర్మాణ అంచనా వ్యయం రూ.500 కోట్లతో టెండర్లు పిలిచింది. పలు సంస్థలు టెండర్లు దాఖలు చేసాయి.
గత నెల 18 నుండి ఈ నెల 1వ తేదీ వరకు టెండర్లు స్వీకరించింది. ఇక ఈరోజు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్ లు ఖరారు అయ్యాయి. ఆ టెండర్లని కమిషనర్ ఆఫ్ టెండర్స్ ఖరారు చేసింది. ఈ టెండర్ ని షాపూర్జీ-పల్లొంజీ కంపెనీ దక్కించుకుంది. టెండర్లు ఖరారైన నేపథ్యంలో ప్రభుత్వం - షాపూర్జీ-పల్లొంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్ జరగనుంది. దాని ప్రకారం టెండర్లు దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుండి 12 నెలల లోపు సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను నిర్మించాల్సి ఉంటుంది. ఏ సమయం వరకు ఎంత పూర్తి కావాలో కూడా టార్గెట్ పెడతారు. ఉదాహరణకు ఈ దీపావళికి సెక్రటేరియట్ భవనాల నిర్మాణం ప్రారంభమైతే.. వచ్చే ఏడాది దసరా దీపావళికి పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!