కోవిడ్ ఎఫెక్ట్...అబుధాబిలో ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- January 17, 2021
అబుధాబి:ఇతర దేశాలతో పాటు దేశీయంగా కూడా అబుధాబిలోకి ఎంట్రీ అయ్యే ప్రయాణికుల కోసం కోత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది అబుధాబి క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆదివారం(జనవరి 17) నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి ఎవరైనా అబుధాబికి ప్రయాణించాలంటే...ప్రయాణానికి ముందు 48 గంటల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అబుధాబి అధికారులకు పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ లేదా డీపీఐ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా చూపించాలి. అయితే..గతంలో ఈ గడువు 72 గంటలుగా ఉండేది. కానీ, అబుధాబి అధికారులు గడువును 48 గంటలకు కుదించారు. అలాగే అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు...నాలుగో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఒకవేళ 8 రోజులు ఉంటే...ఎనిమిదవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించింది. అబుధాబిలోకి అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిబంధనలు యూఏఈలోని అన్ని ప్రాంతాల పౌరులు, ప్రవాసీయులకు వర్తిస్తుంది. అలాగే అబుధాబిలో ఉండే వారు ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చినా..నిబంధనల నుంచి మినహాయింపు ఉండదనే విషయం గుర్తుంచుకోవాలని అధికారులు సూచించారు. అయితే..వాక్సినేషన్ లో పాల్గొన్నవారు..వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు మాత్రం ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!